Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పోతులూరి వీరబ్రహ్మం చెప్పినదే జరుగబోతోందా? దీక్షితులు ఏమన్నారు(Video)

తిరుమల శ్రీవారికి అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణం... ఆగస్టు 12 నుంచి 16 వరకూ జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం కల్పించలేమని తొలుత తితిదే ప్రకటించిన సంగతి తెల

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (19:15 IST)
తిరుమల శ్రీవారికి అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణం... ఆగస్టు 12 నుంచి 16 వరకూ జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం కల్పించలేమని తొలుత తితిదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో విమర్శలు, వాదనలు వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని భక్తులకు దర్శనం కల్పించాల్సిందేనని ఆదేశించారు. 
 
ఈ మొత్తం వ్యవహారంలో తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడారు. తితిదే బోర్డు శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేయాలన్న నిర్ణయాన్ని ఖండించారు. బోర్డు చైర్మన్‌కు సంప్రోణం గరించి తెలియదనీ, ఈ కారణంగానే ఈ వివాదం తలెత్తిందని వెల్లడించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో భక్తులకు శ్రీవారి దర్శనం కొన్నాళ్ల పాటు వుండదని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 
 
అంతేకాదు... ఆ సమయంలో శ్రీవారి నగలు చౌర్యానికి గురవుతాయని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి తితిదే తన నిర్ణయాన్ని మార్చుకుని ఎప్పటిలా భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుందా... అనేది చూడాల్సి వుంది. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments