తప్పుడు వార్తను ప్రచురించిన ఆ టీవీ చానెల్‌పై కేసు : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
గురువారం, 25 జులై 2019 (15:58 IST)
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ డేవిడ్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ-5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో పెట్టిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తను ప్రచురించిన వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
కేసు కూడా పెట్టనున్నట్టు తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని ఆరోపించారు. వైయస్‌.జగన్‌ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారు. దేవుడు ముందు అందరూ సమానులే అని మేం నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్‌.జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ చేతిలో ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారనీ, ఇలా విష ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments