Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్య భక్తుడిలా నేలపై పడుకున్న టీడీడీ బోర్డు సభ్యుడు... (Video)

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (09:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడుగా భారతీయ జనతా పార్టీకి చెందిన తిరుపతి వాసి భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన తితిదే బోర్డు సభ్యుడుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో తన విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి సామాన్య భక్తుడిగా నేలపై పడుకున్నారు. తిరుపతిలోని యాత్రి సదన్‌లో ఆయన ఇతర శ్రీవారి భక్తులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వ దర్శనం టోకెన్స్ పెంచాలని, రూ.300 టికెట్లు నేరుగా ఇవ్వాలని భక్తులు చెప్పారు. అలాగే, భక్తులకు వసతి సౌకర్యాలను పెంచాలన్నని కోరారు. భక్తులు వెల్లడించిన అన్ని సమస్యలను తితిదే పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments