Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూను పట్టించుకోవద్దు.. జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలి!

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (08:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌ను పట్టించుకోవద్దని, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలంటూ ఓ కౌన్సిలర్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా జనతా కర్ఫ్యూను ఆదివారం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వగా దేశ ప్రజలంతా అలానే చేశారు. అయితే, సంగారెడ్డి జిల్లాలో ఓ కౌన్సిలర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. 
 
పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ అయిన షమీ (తెరాస) సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకునేంత వరకు ప్రధాని నరేంద్ర మోడీ మాటలను పట్టించుకోవద్దని, జనతా కర్ప్యూను పట్టించుకోకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన షమీపై కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచినట్టు  సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments