Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ కోసిన మీడియా ప్రతినిధిపై కేకే అసహనం వ్యక్తం చేశారు. 
 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూముల పత్రాలన్నీ చూసిన తరువాతే తాము కొనుగోలు చేశామని అన్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ చూసిన తరువాత, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.
 
అయితే గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా? అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో.... 'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments