Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం - గరిటపట్టిన తెరాస ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (09:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. దీంతో ప్రచారం హోరెత్తిపోతోంది. 
 
ఈ క్రమంలో జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద తెరాస భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభ ఏర్పాట్లను తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన వంటశాలను సందర్శించి, స్వయంగా గరిటపట్టారు. 
 
అధికార తెరాసకు చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు కొనసాగుతున్న విషయం తెల్సిందే. వంట మనిషిగా మారిపోయారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో ఈ సభ నిర్వహణ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సభకు హాజరయ్యే వారికి భోజనం ఏర్పాట్ల కోసం అనేక మంది వంట మనుషులతో ప్రత్యేకంగా భోజనం తయారు చేస్తున్నారు. ఈ భోజనం తయారీలో స్వయంగా పాలుపంచుకున్న హన్మంతరావు గరిట పట్టి వంట పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments