Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజోలులో ఒకే కాన్పులు ముగ్గురు ఆడపిల్లలు.. మగబిడ్డ పుట్టివుంటే..?

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (09:32 IST)
కోనసీమ జిల్లా రాజోలులో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఓ తల్లి నవమాసాలు ముగ్గురు బిడ్డలను మోసి వారికి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామానికి చెందిన నాగరాజు, భవాని భార్యాభర్తలు. వారి పెళ్లి జరిగి మూడేళ్ళు అయ్యింది. 
 
ఇక తాజాగా యిల్లింగి భవాని పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఇక ఆమె గర్భంలో ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు అని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ముగ్గురు కవల పిల్లలను డెలివరీ చేశారు. 
 
కానీ పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లలు పుట్టటం ఆనందంగా ఉందని భవాని భర్త నాగరాజు వెల్లడించారు. 
 
అయితే రోజువారి కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం కాస్త భారమని తండ్రి నాగరాజు చెబుతున్నాడు. మగబిడ్డ ఒక్కడైనా పుట్టివుంటే బాగుండేదని చెప్తున్నాడు. అయినా దేవుడిచ్చిన బిడ్డల్ని బాగా పెంచుకుంటామని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments