Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం.. తండ్రి నిలదీస్తే?

Webdunia
శనివారం, 22 జులై 2023 (16:51 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరులో దారుణం జరిగింది. 11 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల తరువాత మళ్లీ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
దీంతో తట్టుకోలేని ఆ తండ్రి ఏమైతే అది అవుతుందని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిలదీసిన తండ్రిని బెదిరింపులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల గిరిజన బాలిక ఒంటరిగా ఇంట్ోల వున్న సమయంలో 30 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల నవీన్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలిపింది. దీంతో తండ్రి కోపంతో నిందితులను నిలదీశాడు. 
 
కానీ నిందితులే అతడిపై దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో నిందితురాలి తండ్రి భయపడి బయటికి చెప్పలేదు. కానీ రెండు రోజుల తర్వాత కూడా తన కుమార్తెపై అత్యాచారం జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments