Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనమంతా బాగా కలుషితమయ్యాం... అంబానీ వంటివారే.. : హీరో శివాజీ

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:39 IST)
తెలుగు హీరో శివాజీ చాలాకాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మనమంతా చాలా కలుషితమైపోయినట్టు చెప్పారు. ముఖ్యంగా, ఏపీ అంటేనే కులాల కుంపటిగా మారిందన్నారు. అలాగే, దేశ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కూడా దేశం విడిచి వెళ్లాలని భావిస్తున్నారని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, దేశ రాజకీయ వ్యవస్థ బాగా భ్రష్టుపట్టిపోయిందన్నారు. వీటిని భరించలేకే అంబానీ వంటివారు కూడా దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారన్నారు. అదేసమయంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏదో చేద్దామని అనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. అమరావతిని ఎవరూ ఏమి చేయలేరనీ, ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని శివాజీ జోస్యం చెప్పారు. 
 
ఏపీ మంత్రులుగా ఉన్న పలువురు మాట్లాడే పిల్లి కూతలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో ఏ ఒక్కరూ శాశ్వతంకాదన్నారు. అదేసమయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఏ ఒక్కరూ పట్టంచుకోవడం లేదని వాపోయారు. అలాగే, సినిమా వచ్చే సన్నివేశాలను గుర్తుపెట్టుకున్నంత సులభంగా సమాజంలో జరిగే విషయాలను ప్రజలు గుర్తుపెట్టుకోవడం లేదని వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments