నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (08:57 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 
 
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థుల నుంచి ఈ నెల 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని 17వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22గా ఉంది. 
 
పోటీ ఉంటే ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
 
కాగా, రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీనే ముగిసింది. 
 
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thiruveer: కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ తిరువీర్.. భగవంతుడు మూవీ నుంచి సాంగ్ రిలీజ్

Balakrishna: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ చిత్రం ప్రకటన

Peddi Update: పెద్ది పై ప్రేమ ఎంతుందో జూన్ 4న చూడండి : బుచ్చిబాబు సాన

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments