ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు యుద్ధ ఖైదీలా? కోదండరాం

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (15:44 IST)
ఆర్టీసీ కార్మికులను యుద్ధ ఖైదీల్లా చూశారంటూ తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మికలను తెరాస సర్కారు చర్చలకు ఆహ్వానించింది. 
 
దీంతో ఆర్టీసీ తాత్కాలిక ఎండీతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఆ సమయంలో వారిని అవమానంగా చూశారనే వార్తలు వచ్చాయి. వీటిపై కోదండరామ్ స్పందిస్తూ, శనివారం చర్చల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను యుద్ధ ఖైదీల్లా చూశారని ఆరోపించారు. 
 
ఆర్టీసీ విషయంలో కోర్టు చేసిన సూచనలను పాటించాలని ఆయన సూచించారు. తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సర్కారు సరైన రీతిలో స్పందించి వెంటనే చర్చలు సఫలం అయ్యే దిశగా కృషి చేయాలని అన్నారు.
 
కాగా, ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తమకు సమ్మె విరమించాలనే ఉందని అధికారులను చెప్పామని అన్నారు. నిన్న వారు అసలు చర్చలు జరపలేదని, ఈ రోజు పిలిచినా చర్చలకు వస్తామని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్లు ఉండరాదన్న సీఎం కేసీఆర్ కోరిక కూడా నెరవేరుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments