Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్డిగారు, సుబ్బారెడ్డి గారు ఆత్మీయ ఆలింగనం, అంతమంది ఉండగా ఆయనతోనే..?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (17:19 IST)
రెండవసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు వై.వి.సుబ్బారెడ్డి. ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. 
 
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం 9.45 నిమిషాలకు అట్టహాసంగా ప్రమాణస్వీకారం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనే ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. 
 
అందరితోను కరచాలనంతో అభినందనలు తెలిపిన సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని మాత్రం రెడ్డిగారు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టిటిడి ఛైర్మన్ కాక ముందు నుంచి కరుణాకర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు మృదుస్వభావుడిగా, మంచి వ్యక్తిగాను, ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించుకున్నారు కరుణాకర్ రెడ్డి.
 
అందుకే సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డి అంటే అంత అభిమానం. అంతేకాదు టిటిడి నిధులతో తిరుపతిలో ఎన్నో అభివృద్థి కార్యక్రమాలను జరుగుతూ ఉండడం.. ఆ కార్యక్రమాలకు కరుణాకర్ రెడ్డితో కలిసి పనిచేయడం సుబ్బారెడ్డి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోను కరుణాకర్ రెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ఉండటంతో ఆ పరిచయాలు కూడా ఉన్నాయి. 
 
ఇదంతా కలగలిపి చివరకు టిటిడి ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరిలోను చర్చకు కారణమయ్యారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments