కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...

Webdunia
బుధవారం, 5 మే 2021 (16:48 IST)
కోవిడ్‌తో చనిపోయిన 21 మంది అనాధ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రుయాలోని మార్చురీ నుంచి స్వయంగా తన చేతులతో మృతదేహాలను మోసి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ తరువాత వాటిని మామండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఖననం చేశారు. 
 
ఈ సంధర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు అంత్యంత ఆత్మీయులుగా మనతో, మన మధ్య తిరిగిన వారు కరోనా కారణంగా చనిపోతే మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోయిన వారు, ఆర్థిక సమస్యలతో మృతదేహాలను వదిలి వెళ్ళిపోయిన వారికి సంబంధించి మొత్తం 21 మృతదేహాలను గుర్తించామన్నారు. అందుకే అలాంటి వారికి అన్నీ తానై అంతిమ సంస్కారం చేసినట్లు చెప్పారు. తనకు 60 సంవత్సరాల వయస్సు పైబడిందని.. ఇప్పటికే రెండుసార్లు కరోనా కూడా సోకిందని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
 
అయినా సరే ఎలాంటి భయాందోళనకు తాను గురికావడం లేదని.. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments