Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...

Webdunia
బుధవారం, 5 మే 2021 (16:48 IST)
కోవిడ్‌తో చనిపోయిన 21 మంది అనాధ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రుయాలోని మార్చురీ నుంచి స్వయంగా తన చేతులతో మృతదేహాలను మోసి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ తరువాత వాటిని మామండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఖననం చేశారు. 
 
ఈ సంధర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు అంత్యంత ఆత్మీయులుగా మనతో, మన మధ్య తిరిగిన వారు కరోనా కారణంగా చనిపోతే మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోయిన వారు, ఆర్థిక సమస్యలతో మృతదేహాలను వదిలి వెళ్ళిపోయిన వారికి సంబంధించి మొత్తం 21 మృతదేహాలను గుర్తించామన్నారు. అందుకే అలాంటి వారికి అన్నీ తానై అంతిమ సంస్కారం చేసినట్లు చెప్పారు. తనకు 60 సంవత్సరాల వయస్సు పైబడిందని.. ఇప్పటికే రెండుసార్లు కరోనా కూడా సోకిందని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
 
అయినా సరే ఎలాంటి భయాందోళనకు తాను గురికావడం లేదని.. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments