Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...

Webdunia
బుధవారం, 5 మే 2021 (16:48 IST)
కోవిడ్‌తో చనిపోయిన 21 మంది అనాధ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రుయాలోని మార్చురీ నుంచి స్వయంగా తన చేతులతో మృతదేహాలను మోసి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ తరువాత వాటిని మామండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఖననం చేశారు. 
 
ఈ సంధర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు అంత్యంత ఆత్మీయులుగా మనతో, మన మధ్య తిరిగిన వారు కరోనా కారణంగా చనిపోతే మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోయిన వారు, ఆర్థిక సమస్యలతో మృతదేహాలను వదిలి వెళ్ళిపోయిన వారికి సంబంధించి మొత్తం 21 మృతదేహాలను గుర్తించామన్నారు. అందుకే అలాంటి వారికి అన్నీ తానై అంతిమ సంస్కారం చేసినట్లు చెప్పారు. తనకు 60 సంవత్సరాల వయస్సు పైబడిందని.. ఇప్పటికే రెండుసార్లు కరోనా కూడా సోకిందని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
 
అయినా సరే ఎలాంటి భయాందోళనకు తాను గురికావడం లేదని.. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments