Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరోమారు కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

మరోమారు కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
, గురువారం, 8 అక్టోబరు 2020 (09:21 IST)
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కరోనా వైరస్ మరోమారు కాటేసింది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే భూమన కరుణాకర్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం తిరుపతిలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన మృతదేహాలను స్వయంగా శ్మశానంలో పూడ్చిపెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇపుడు మరోమారు ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!