Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదీవద్దూ.. ఇదీవద్దూ... తిరుపతిని రాజధానిని చేయండి : చింతా మోహన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:17 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేసిన పునాదిరాయి అనాథగా మిగిలిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. పైగా, అమరావతి వద్దూ.. వైజాగ్ వద్దూ... తిరుపతిని రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ప్రధాని వేసిన పునాది రాయి అనాథగా మిగిలిందన్నారు. పైగా, కేంద్రంలో ఆయన పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నల్లధనానికి కేరాఫ్ చిరునామాగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పతనావస్థకు చేరిందని జోస్యం చెప్పారు. దుగ్గరాజపట్న ఓడరేవు రాకుండా అడ్డుకున్నది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. 
 
ఏర్పేడు - రావూరుల మధ్య దాదాపు 1.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూములతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 
 
కండలేరు, సోమశిల జలాశయాలు దగ్గర్లోనే ఉన్నాయనీ, తిరుపతికి ఏడు జాతీయ రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉందని, ఇంతకంటే రాజధాని నిర్మాణానికి ఏం కావాలని చింతా మోహన్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments