Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదీవద్దూ.. ఇదీవద్దూ... తిరుపతిని రాజధానిని చేయండి : చింతా మోహన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:17 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేసిన పునాదిరాయి అనాథగా మిగిలిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. పైగా, అమరావతి వద్దూ.. వైజాగ్ వద్దూ... తిరుపతిని రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ప్రధాని వేసిన పునాది రాయి అనాథగా మిగిలిందన్నారు. పైగా, కేంద్రంలో ఆయన పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నల్లధనానికి కేరాఫ్ చిరునామాగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పతనావస్థకు చేరిందని జోస్యం చెప్పారు. దుగ్గరాజపట్న ఓడరేవు రాకుండా అడ్డుకున్నది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. 
 
ఏర్పేడు - రావూరుల మధ్య దాదాపు 1.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూములతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 
 
కండలేరు, సోమశిల జలాశయాలు దగ్గర్లోనే ఉన్నాయనీ, తిరుపతికి ఏడు జాతీయ రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉందని, ఇంతకంటే రాజధాని నిర్మాణానికి ఏం కావాలని చింతా మోహన్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments