Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ లక్షల రూపాయల నగలు, నగదుతో జల్సా చేసింది. విషయ

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (19:50 IST)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ లక్షల రూపాయల నగలు, నగదుతో జల్సా చేసింది. విషయం కాస్తా ఒక వ్యక్తి భార్య ద్వారా మీడియాకు తెలియడంతో పరారీలో ఉందా మహిళ. ఇంతకీ ఎవరా మహిళ?
 
తిరుపతి మంగళంకు చెందిన చంద్రకళకు 2013 సంవత్సరంలో వివాహమైంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భర్త గురుమూర్తి మెకానిక్. ఇతని జీతం ఇంటికి సరిపోకపోవడంతో చంద్రకళ కొన్ని ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉండేది. కొన్ని ఇళ్ళలో పనిలో చేరిన చంద్రకళ వాసు, సత్యనారాయణ, రాజు అనే ముగ్గురు ఇంటి యజమానులతో సహజీవనం చేయడం ప్రారంభించింది. అంతేకాదు ముగ్గురిని రహస్యంగా పెళ్ళిళ్ళు చేసేసుకుంది కూడా. 
 
అయితే ఆ తరువాతే అసలు కథ తెలిసొచ్చింది ముగ్గురికి. పెళ్ళిళ్ళు చేసుకుని వారి ఇంట్లో వారి భార్యల దగ్గర ఉండే నగలు, నగదును తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టుకునేది చంద్రకళ. ఇలా మరో వివాహం చేసుకోవడానికి సిద్థమవుతుంటే ఆ వ్యక్తి భార్య నాగమణి మీడియాను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలంటూ మీడియాను కోరింది. విషయం కాస్త చంద్రకళకు తెలియడంతో ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. పోలీసులు నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments