Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్పుల కేసు తిరగదోడితే బాలకృష్ణ కూడా వైకాపాలోకి వస్తారు : ఏపీ డిప్యూటీ సీఎం

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (11:36 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా పార్టీ మారుతారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యంమత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. పైగా, దీనికి సంబంధించిన ఓ చిట్కా కూడా చెప్పారు. బాలయ్యపై ఉన్న కాల్పులు కేసును తిరగదోడితే ఖచ్చితంగా ఆయన కూడా ఖచ్చితంగా వైకాపాలో చేరుతారని అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం మొదలు పెడితే, తెలుగుదేశం పార్టీలో మిగిలేది చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. బాలకృష్ణపై ఉన్న కాల్పుల కేసును తిరిగి తెరుస్తామని చెబితే, ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారన్నారు. 
 
తన ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో బాలకృష్ణ, నాటి సీఎం వైఎస్ సహాయంతోనే బయటపడ్డారని నారాయణస్వామి గుర్తు చేశారు. అపుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా తనవంతు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. 
 
ఆపై ఇతర పార్టీ నేతలను బెదిరింపులతో చేర్చుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా, సమాధానాన్ని దాటవేశారు. సీఎంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డ ఆయన, స్వలాభం కోసమే అమరావతి పేరిట ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నారాయణ  స్వామి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments