Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కామాంధుడిని పదవి నుంచి తొలగించాలి.. ప్రజా సంఘాల డిమాండ్

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (11:16 IST)
ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథిరాజ్ అసభ్యకర సంభాషణ సాగించాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. సాక్షాత్ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన ఎస్వీబీసీ ఛానెల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పృథ్వీ అసభ్యకరంగా ఓ మహిళతో సంభాషణలు సాగించడం ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనిపై అనేక ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఈ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, 'తక్షణం పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించాలి. ఇంకెంతమందిని వేధిస్తున్నాడు.. సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు. ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం తప్పు. ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలి' అంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
అంతేకాకుండా, తితిదేలో సేవల కోసం ఎవరిని పడితే వారిని పెద్ద పెద్ద హోదాల్లో నియమించడం సరికాదని వారు హితవు పలుకుతున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని ఆయన మద్యం తాగుతుంటాడని కూడా మాకు ఫిర్యాదులు వచ్చాయి. కఠిన చర్యలు తీసుకోవాలి. కొందరి వద్ద ఆయన డబ్బులు కూడా వసూలు చేశాడు. అలాంటి వ్యక్తిని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా కొనసాగిస్తే ఆ సంస్థకే అప్రతిష్ట' అని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments