Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేసినట్టు రువుజు చేసి ఈ చెప్పుతో కొట్టండి : పృథ్వీ రాజ్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (18:05 IST)
తాను తప్పు చేసినట్టు రుజువైతే ఈ చెప్పుతో కొట్టండి అంటూ సినీనటుడు, వైకాపా నేత, తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ గిరికి రాజీనామా చేసిన పృథ్వీ రాజ్ అన్నారు. రైతులంటే బురదలో ఉంటారనీ, బంగారు గాజులు వేసుకుని మొబైల్ ఫోన్స్ చేతబట్టుకుని ఉండరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పృథ్వీరాజే ఎస్వీబీసీ ఛానెల్‌లో పని చేసే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన వీడియో లీక్ కీవడంతో రాసలీలల బురదలో చిక్కుకుని ఛైర్మన్ పదవిని కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించాడు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని చెప్పాడు. తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments