Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలగిరిలో ఆరేళ్ల బాలుడికి కరోనా..

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:25 IST)
తిరుమలగిరి పట్టణంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్‌ రాగా, మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ తేలింది. జిల్లాలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసు వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వస్తూ మార్గమధ్యలో తిరుమలగిరిలోని ఓ ప్రార్థన మందిరంలో బస చేశాడు. అతడినుంచి ఈ ప్రార్థన మందిరంలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా అంటుకుంది.

ఇతనినుంచి ఇంటి పక్కనే ఉన్న మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ధ్రువీకరించారు. తాజాగా పట్టణంలో చికెన్‌షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తికి వీరినుంచే వైరస్‌ అంటుకున్నట్లు తేలింది. అలాగే ఆత్మకూర్‌ మండలంలో ఏపూర్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.
 
సూర్యాపేట పట్టణంలోని మార్కెట్‌ బజార్‌కు ఏపూర్‌కు చెందిన పాజిటివ్‌ వ్యక్తి తండ్రి ఇటీవల వెళ్లాడు. ఇతను మార్కెట్‌లో ఉంటున్న, ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యాపారికి డబ్బులు ఇచ్చాడు. ఇతని కుటుంబాన్నంతా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి నమూనాలను పరీక్షల కోసం పంపారు. తండ్రి, కుటుంబ సభ్యులు మినహాయిస్తే కుమారుడికి పాజిటివ్‌ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. ఆ కుమారునికి ఆరేళ్లే. కుటుంబంలో అందరికి నెగెటివ్‌ వచ్చి ఈ బాలుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments