Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ-ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:08 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సర్వదర్శనం టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైన నేపథ్యంలో.. ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
టీటీడీ రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీ చేయలేదు. దీంతో ఇవాళ సర్వదర్శనం టికెట్లను జారీ చేశారు. ఈ టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్ వద్దకు బారులు తీరారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.  
 
ఈ నేపథ్యంలో అధిక రద్దీ కారణంగా భక్తులు నేరుగా తిరుమలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. టోకెన్ల కేంద్రాల వద్ద టోకెన్లు లేకుండానే ఆధార్‌ చూపెట్టి శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చునని తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments