Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం

Webdunia
గురువారం, 5 మే 2022 (09:47 IST)
గత యేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత ఐదు నెలలుగా కొనసాగిన మరమ్మతు పనులు తితిదే అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మార్గాన్ని గురువారం నుంచి భక్తుల కోసం ప్రారంభించనున్నారు. ఇందుకోసం నిర్వహించే ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆయన గురువారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. 
 
కాగా, గత యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ మెట్లమార్గం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీనికి ఐదు నెలలుగా మరమ్మతులు చేపట్టారు. తిరుమలకు నడిచి వెళ్లేందుకు భక్తులు అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేసేందుకు రూ.3.60 కోట్లను తితిదే ఖర్చు చేసింది. 
 
800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్ఠంగా నిర్మించారు. గురువారం ఈ మార్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఇప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments