Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో బాలుడు కిడ్నాప్.. ఒక మహిళ బాలుడిని ఎత్తుకుని?

crime scene
, సోమవారం, 2 మే 2022 (13:33 IST)
తిరుమలలో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి వచ్చిన, అక్కడ ఆలయానికి ఎదురుగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ గురవడం స్థానికంగా ఆందోళన కలిగించింది. 
 
తిరుపతి దామినేడుకు చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదు సంవత్సరాల బాలుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం 5.45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. 
 
సైలెంట్‌గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడి నుండి ఉడాయించింది. శ్రీవారి ఆలయం ఎదురుగా బాలుడు కూర్చుని ఉండగా మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటివరకు తమతో ఉన్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్యభామ వర్శిటీలో 'అఛీవర్స్ డే' వేడుకలు - 92 శాతం క్యాంపస్ రిక్రూట్మెంట్స్