తిరుమల వేదపండితులు గొడవ పడ్డారు... అదీ సిఎం ముందే...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే అందరికీ పండుగే. ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే పట్టువస్త్రాలను సమర్పించే సమయంలో తల

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (19:27 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే అందరికీ పండుగే. ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే పట్టువస్త్రాలను సమర్పించే సమయంలో తలపాగా చుట్టేందుకు ఇద్దరు వేదపండితులు పోటీలు పడ్డారు. అది కూడా ఒకరు ప్రధాన అర్చకులు, మరొకరు కంకరభట్టాచార్యులు. 
 
ప్రతియేటా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించే వారికి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులే తలకు పాగా కడుతారు. అలాంటిది ఈసారి తల పాగా కట్టేందుకు కంకరభట్టాచార్యులు వేణుగోపాల్ దీక్షితులు ముందుకు వచ్చారు. తలపాగా కట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రమణదీక్షితులు తలపాగాను తీసుకొని చంద్రబాబుకు చుట్టారు. దీంతో వేణుగోపాల్ దీక్షితులు పక్కకు వెళ్ళిపోయారు. 
 
తలపాగా చుట్టిన తరువాత రమణదీక్షితులు ఇది నేనే కట్టాలన్న విధంగా వేణుగోపాల్ వైపు చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడంతో మిగిలిన పండితులు వారిని తధేకంగా గమనించారు. అయితే సిఎం పట్టువస్త్రాలను ఇచ్చేందుకు బయలుదేరుతుండగా వెంటనే రమణదీక్షితులు కూడా ఆయనతో పాటు వచ్చేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది కానీ వీరిద్దరు తలపాగా కట్టేందుకు పోటీలు పడటం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments