Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూహ్యంగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (20:17 IST)
కరోనాతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన విషయం తెలిసిందే. అంతరాష్ట్ర సర్వీసులను ఆపేయడం.. రాకపోకలు లేకపోవడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య లాక్‌డౌన్ సమయంలో బాగా తగ్గిపోయింది. అయితే ఆ తరువాత లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కాస్త ఊరట కలిగింది.
 
తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అయితే భక్తుల రద్దీ ప్రస్తుతం అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో టిక్కెట్లను బుక్ చేసుకుని కరోనా భయంతో తిరుమలకు రావాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు భక్తులు. 
 
కానీ ప్రస్తుతం మాత్రం టోకెన్లను బుక్ చేసుకున్న భక్తులందరూ తిరుమలకు వచ్చేస్తున్నారు. ఆ స్వామివారిని తనివితీరా దర్సించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.
 
లాక్ డౌన్ సమయంలో హుండీ ఆదాయాన్ని చెప్పని టిటిడి ప్రస్తుతం పెరిగిన హుండీ ఆదాయం గురించి మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం కోటి రూపాయలు వచ్చినట్లు టిటిడి అధికారికంగా ప్రకటించింది.
 
లాక్ డౌన్ తరువాత ఈ తరహాలో హుండీ ఆదాయం ఇదే ప్రథమం. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక హుండీ ఆదాయం కూడా క్రమేపీ పెరుగుతుందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు. తిరుమలలో భక్తుల తాకిడి కూడా క్రమేపీ కనిపిస్తుండడం.. గోవిందనామస్మరణలు వినిపిస్తుండటం తిరుమలలో సాధారణ స్థితికి చేరుకుంటోందన్న అభిప్రాయం టిటిడి అధికారుల నుంచి వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments