Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వస్తున్నారా? ఇప్పుడే రావద్దంటున్న తితిదే... మరెప్పుడు రావాలి?

Webdunia
శనివారం, 28 మే 2022 (22:31 IST)
వేసవి శెలవులు కావడంతో కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ శనివారం నాటికి వేల సంఖ్యలో భారీగా భక్తులు బారులు తీరారు. దీనితో శనివారం నాడు తితిదే ఓ విజ్ఞప్తి చేసింది.

 
శనివారం సాయంత్రానికే సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు విన్నపం చేసారు. ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం భక్తుల దర్శనానికి కనీసం 48 గంటల సమయం పడుతుందనీ, అందువల్ల తిరుమల శ్రీవేంకటేశుని దర్శనభాగ్యం కోసం కాస్త ఆగి రావాలని విజ్ఞప్తి చేసారు.

 
ప్రస్తుతం తిరుమల చేరుకున్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామనీ, వీరికితోడుగా మరింతమంది భక్తులు వస్తే సౌకర్యాలను కల్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందన్నారు. అందువల్ల కొద్దిరోజులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments