తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ఠాగూర్
శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:24 IST)
పండగ సీజన్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులతో పాటు తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా ఈ ప్రత్యేక సర్వీసులను నడుపనుంది. 
 
ఇందులోభాగంగా తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి (07637) ప్రతి ఆదివారం ఒక సర్వీసును నడపనున్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ - తిరుపతి రైలు (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు షిర్డీలో ప్రారంభమై, బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు తిరుపతికి వస్తుంది.
 
అలాగే తిరుపతి నుంచి జల్నాకు (07610) ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జల్నా - తిరుపతి రైలు (07609) ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు ఏపీలోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.
 
అలాగే, చెన్నై - షాలిమార్, కన్యాకుమారి - హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పండగ రద్దీని నియంత్రించేందుకు ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 170 రైళ్లు పూర్తిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తుండగా, మిగిలినవి ఇతర రైల్వే జోన్‌ల నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తాయని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments