Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గర్భవతి చేసి... మరదలిని లాడ్జీకి తీసుకెళ్లిన బావ... చివరకు...

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:42 IST)
కట్టుకున్న భార్య గర్భందాల్చడంతో ఆమె మరదలిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెను తన మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో గడిపేందుకు లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడుక వెళ్ళాక గానీ మరదలికి జ్ఞానోదయం కాలేదు. తన అక్కకు అన్యాయం చేసి తనను లోబరుచుకున్నాడన్న విషయం. 
 
అక్కకు అన్యాయం చేయలేనని చెబుతూ బుధవారం రాత్రి ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించగా, అతడు అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయి నవీన్ (26) నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లి జేఎన్‌టీయూకి చెందిన మహిళను పెళ్లాడాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. అయితే, నవీన్ దంపతుల మధ్య ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో భార్య చెల్లెలి (మరదలు)తో నవీన్ ప్రేమ మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య తమ కుటుంబ సభ్యుల సొంతూరైన గుడివాడకు వెళ్లింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని నవీన్ బెదిరించడంతో అందరూ కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, మరదలితో కలిసి మూడు రోజుల క్రితం నవీన్ తిరుపతి వెళ్లాడు. స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే, అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
మరోవైపు, సాయి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆమెకు మెలకువ రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం