Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనమైంది.. ఎలా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (13:21 IST)
తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు. చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టి తండ్రి వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటున్నాడు.
 
హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments