Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి..?

Advertiesment
మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి..?
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:58 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బెదిరించి ఆ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. 
 
అంతేగాకుండా తన వద్ద గన్ వుందని.. ఆమె తల్లిదండ్రులను కాల్చేస్తానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. విషయం బయట పడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన గోపిగా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో ఉద్యోగం ఊడితే.. అదృష్టం అలా వరించింది...