Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు దుర్మరణం.. ఎలా?

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (09:49 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలతెలవారుతుండగానే ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ముగ్గురు యువకులు టీ తాగేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్రవిషాదం నెలకొంది. జిల్లాలోని బెస్తవారి పేట మండలం, శెట్టిచెర్ల అడ్డురోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 
 
పాపాయిపల్లికి చెందిన పవన్ (20), రాహుల్ (21), శ్రీనివాస్ (21) అనే ముగ్గురు స్నేహితులు కలిసి టీ తాగేందుకు ద్విచక్రవాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా గిద్దలూరు నుంచి బెస్తవారి పేట వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments