Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో అర్థరాత్రి రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ఓ మహిళతో పాటు ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. వారివద్ద ఉన్న సంచల్లో తితిదే లాకర్ అలాట్మెంట్ టికెట్లు ఉన్నాయి. గూండురు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వయసు 45 నుంచి 50 యేళ్ళ మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. 
 
అయితే, పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదంబారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? లేదంటే ఇంకెవరైనానా? అనే విషయాలు తెలియాల్సివుంది. ప్రమాద సమయంలో వారి చేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్మెంట్ టిక్కెట్లు ఉన్నాయి. వాటితోపాటు సంచిలో ఉన్న ఫోన్ నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments