Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో అర్థరాత్రి రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ఓ మహిళతో పాటు ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. వారివద్ద ఉన్న సంచల్లో తితిదే లాకర్ అలాట్మెంట్ టికెట్లు ఉన్నాయి. గూండురు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వయసు 45 నుంచి 50 యేళ్ళ మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. 
 
అయితే, పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదంబారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? లేదంటే ఇంకెవరైనానా? అనే విషయాలు తెలియాల్సివుంది. ప్రమాద సమయంలో వారి చేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్మెంట్ టిక్కెట్లు ఉన్నాయి. వాటితోపాటు సంచిలో ఉన్న ఫోన్ నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments