Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:52 IST)
చిత్తూరు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. గుర్రంకొండ మండలం తుమ్మలగొందికి చెందిన ఎం.స్వర్ణలతకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కు సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రి బయల్దేరారు.

అయితే, మార్గమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆస్పత్రిలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు చిన్నారులు, తల్లి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణ కాన్పులోనే ముగ్గురు చిన్నారులకు జన్మనివ్వడం విశేషమన్నారు.

స్వర్ణలత, శివకుమార్‌ దంపతలకు మొదటి కాన్పులో లాస్య (5), రెండో కాన్పులో ఉమశ్రీ (3) ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఓ బాబు, ఇద్దరు పాపలు జన్మించారు. మొత్తం ఐదుగురు సంతానం. సాధారణంగా మొదటి కాన్పులోనే ఇలా ముగ్గురు కవలలు జన్మిస్తారని, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం మాత్రం చాల అరుదని వైద్యులు చెప్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి కాన్పులు జరిగాయి. నలుగురు, ఐదుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments