Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ మిస్టరీని ఛేదించిన పోలీసులు... సిబ్బందికి రివార్డులు

Webdunia
గురువారం, 18 జులై 2019 (15:28 IST)
ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దోపిడీ మిస్టరీని తమ పోలీసులు ఛేదించారని డీసీపీ విజయరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు. పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ను సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు. 
 
వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చాడు. సంస్థలో జరిగిన‌ నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు. వదిన కుమారుడు విశాల్‌కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్‌కు సూచనలు చేశాడు. విశాల్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఈ కేసు మిస్టరీ‍ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం డీసీపీ విజయరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments