Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. వెయ్యి కోత!

Webdunia
శనివారం, 21 మే 2022 (16:12 IST)
అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లులకు వైసీపీ సర్కార్ ఏటా రూ.15 వేల రూపాయల మొత్తాన్ని అమ్మఒడి పథకం రూపంలో ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.15 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 
 
అయితే వివిధ కారణాలతో ఈ పథకంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో లబ్దిదారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హతల్ని పలుమార్లు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే మొత్తంలోనూ మార్పులు చేస్తోంది.
 
అమ్మఒడి పథకంలో భాగంగా మొత్తం రూ.15 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఏటా జమ చేయాల్సి ఉండగా.. ఇందులో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలే ఇస్తున్నారు. అదేమని అడిగితే స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఈ వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 
 
దీంతో తొలి ఏడాది నుంచే అర్హులకు లభించాల్సిన రూ.15 వేలకు బదులు రూ.14 వేలే జమ అవుతోంది. దీంతో తొలి ఏడాది నుంచే వెయ్యి రూపాయల కోతతో ఈ పథకం అమలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments