ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిరోభారంగా మారిన కేసు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:57 IST)
వైసీపీలో కొత్త‌గా ఎమ్మెల్సీగా ఎంపిక‌యిన తోట త్రిమూర్తులుకు పాత కేసు ఒక‌టి శిరోభారంగా మారింది. ద‌ళిత యువ‌కుల శిరోముండ‌నం కేసును వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఒక వ‌ర్గం ధ‌ర్నాకు దిగింది. తూర్పుగోదావ‌రి జిల్లా రామచంద్రపురంలో ఈ ధర్నాను అడ్డుకునేందుకు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రామ చంద్రపురంలో  భారీగా పోలీసులు మోహరించారు.

వెంకటాయపాలెం గ్రామంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఆనాటి  కేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై అభియోగాలున్నాయి. ఈ కేసును తక్షణమే పరిష్కరించాలని, గవర్నర్ కోటాలో తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలని ధ‌ర్నాకు దిగారు.

దళిత మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో భారీగా పోలీసుల మోహరించ‌గా, ఆందోళన చేసేందుకు దళిత సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు త‌ర‌లివ‌స్తుండ‌టం ఉద్రిక్త‌త‌కు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments