ఓడినా చంద్రబాబులో మార్పు రాలేదు: మంత్రి పేర్నినాని

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:17 IST)
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అభివృద్ధికి చంద్రబాబే చాంపియన్‌ అయితే ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? అని ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు చంద్రబాబుకు తన జీవిత కాలంలో అర్థం కావన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ పాలిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు.

రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments