Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (13:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటూ పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసారు. కానీ కొన్ని సచివాలయాల్లో తగినంత పనులు లేకుండా ఖాళీగా కూర్చునే సిబ్బంది ఎక్కువగా వున్నట్లు కూటమి ప్రభుత్వం కనిపెట్టింది. అంతేకాదు... పనులు చేయించుకునేందుకు సచివాలయంకి వెళితే సదరు ఉద్యోగి ఫీల్డ్ వర్కుకి వెళ్లాడంటూ తప్పించుకుని తిరిగేవారు కూడా వున్నట్లు స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు.
 
మొత్తమ్మీద గ్రామ సచివాలయాలలో కొన్ని గతి తప్పి పని చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పసిగట్టి గట్టి చర్యలకు దిగింది. ప్రస్తుతం పనిలేకుండా ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న వారి సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సచివాలయాలను ఏ,బి,సి అంటూ 3 క్యాటగిరీలుగా విభజించింది.
 
ఆ ప్రకారం కనీసం 2500 మంది ప్రజలకు ఓ సచివాలయం వుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది. ఈ ప్రకారంగా చూస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments