Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (13:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటూ పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసారు. కానీ కొన్ని సచివాలయాల్లో తగినంత పనులు లేకుండా ఖాళీగా కూర్చునే సిబ్బంది ఎక్కువగా వున్నట్లు కూటమి ప్రభుత్వం కనిపెట్టింది. అంతేకాదు... పనులు చేయించుకునేందుకు సచివాలయంకి వెళితే సదరు ఉద్యోగి ఫీల్డ్ వర్కుకి వెళ్లాడంటూ తప్పించుకుని తిరిగేవారు కూడా వున్నట్లు స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు.
 
మొత్తమ్మీద గ్రామ సచివాలయాలలో కొన్ని గతి తప్పి పని చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పసిగట్టి గట్టి చర్యలకు దిగింది. ప్రస్తుతం పనిలేకుండా ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న వారి సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సచివాలయాలను ఏ,బి,సి అంటూ 3 క్యాటగిరీలుగా విభజించింది.
 
ఆ ప్రకారం కనీసం 2500 మంది ప్రజలకు ఓ సచివాలయం వుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది. ఈ ప్రకారంగా చూస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments