గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (13:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటూ పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసారు. కానీ కొన్ని సచివాలయాల్లో తగినంత పనులు లేకుండా ఖాళీగా కూర్చునే సిబ్బంది ఎక్కువగా వున్నట్లు కూటమి ప్రభుత్వం కనిపెట్టింది. అంతేకాదు... పనులు చేయించుకునేందుకు సచివాలయంకి వెళితే సదరు ఉద్యోగి ఫీల్డ్ వర్కుకి వెళ్లాడంటూ తప్పించుకుని తిరిగేవారు కూడా వున్నట్లు స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు.
 
మొత్తమ్మీద గ్రామ సచివాలయాలలో కొన్ని గతి తప్పి పని చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పసిగట్టి గట్టి చర్యలకు దిగింది. ప్రస్తుతం పనిలేకుండా ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న వారి సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సచివాలయాలను ఏ,బి,సి అంటూ 3 క్యాటగిరీలుగా విభజించింది.
 
ఆ ప్రకారం కనీసం 2500 మంది ప్రజలకు ఓ సచివాలయం వుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది. ఈ ప్రకారంగా చూస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments