Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:29 IST)
రాబోయే 3 నెలల కాలంలో రూ.986 కోట్ల మేర పన్నులు, బకాయిలు వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్  నెలలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడానికి శనివారంలోగా ప్రణాళికలు అందజేయాలని ఏపీ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్  పియూష్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజూ డివిజన్, సర్కిల్ వారీగా మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. బోగస్ డీలర్లు, వ్యాపారులు, బిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సరైన సమయంలో అటువంటివారిపై దాడులకు దిగుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

పన్నుల వసూలు సమయంలో సక్రమంగా పన్నులు చెల్లించేవారు, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమన్నారు. ఇదే విషయమై తమ శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు.

నిర్ధేశించిన రూ.986 కోట్ల వసూలుకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఆ ప్రకటనలో చీఫ్ కమిషనర్ పియూష్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments