రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:29 IST)
రాబోయే 3 నెలల కాలంలో రూ.986 కోట్ల మేర పన్నులు, బకాయిలు వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్  నెలలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడానికి శనివారంలోగా ప్రణాళికలు అందజేయాలని ఏపీ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్  పియూష్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజూ డివిజన్, సర్కిల్ వారీగా మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. బోగస్ డీలర్లు, వ్యాపారులు, బిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సరైన సమయంలో అటువంటివారిపై దాడులకు దిగుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

పన్నుల వసూలు సమయంలో సక్రమంగా పన్నులు చెల్లించేవారు, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమన్నారు. ఇదే విషయమై తమ శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు.

నిర్ధేశించిన రూ.986 కోట్ల వసూలుకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఆ ప్రకటనలో చీఫ్ కమిషనర్ పియూష్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments