Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:29 IST)
రాబోయే 3 నెలల కాలంలో రూ.986 కోట్ల మేర పన్నులు, బకాయిలు వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్  నెలలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడానికి శనివారంలోగా ప్రణాళికలు అందజేయాలని ఏపీ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్  పియూష్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజూ డివిజన్, సర్కిల్ వారీగా మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. బోగస్ డీలర్లు, వ్యాపారులు, బిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సరైన సమయంలో అటువంటివారిపై దాడులకు దిగుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

పన్నుల వసూలు సమయంలో సక్రమంగా పన్నులు చెల్లించేవారు, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమన్నారు. ఇదే విషయమై తమ శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు.

నిర్ధేశించిన రూ.986 కోట్ల వసూలుకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఆ ప్రకటనలో చీఫ్ కమిషనర్ పియూష్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments