Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యుడికి అందుబాటులో సినిమా... మంత్రి స్పష్టీకరణ

అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (20:33 IST)
అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులతో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘ భేటీకి డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనివార్య కారణాలతో హాజరు కాకపోవడంతో, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసుల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
 
సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు... మంత్రి కాలవ శ్రీనివాసులకు కొన్ని ప్రతిపాదనలు అందజేశారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ఏసీ సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలు ఒక రకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి మంత్రి కాలవ శ్రీనివాసులు అంగీకరించలేదు. ఆయా ప్రాంతాల వారీగా, ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ల ధరలు నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 
 
మధ్యతరగతి, పేదలకు సరసమైన ధరలకు వినోదం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. మరోసారి జరిగే మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సినిమా టిక్కెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ, సినీ నిర్మాతలు డి.సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌తో పాటు ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments