Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా వాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి: టి.విజయ్ కుమార్ రెడ్డి

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (15:56 IST)
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు వృత్తిలో భాగంగా ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ  కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు.

కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో పాత్రికేయులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని కొనియాడారు. మందులేని మహమ్మారి కరోనా వైరస్ సంక్రమించకుండా ప్రజలకు పాత్రికేయులు మరింత అవగాహన కల్పించాలని కోరారు.  కరోనా వైరస్ ఎవరికైనా రావచ్చని కాబట్టి మీడియాలో పనిచేసే వారంతా విధులు నిర్వర్తించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైన సందర్భంలో మాస్కులు ధరించాలని సలహానిచ్చారు. పాత్రికేయులు ముందుగా తమల్ని తాము రక్షించుకోవాలని కోరారు. తరుచూ మైకులు వాడుతున్న సందర్భంలో కరోనా సోకే ప్రమాదముందని కావున జాగ్రత్తగా ఉండాలన్నారు. శానిటైజర్ వాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వీలైతే మైక్ పై స్పాంజిను తరుచూ తీసివేస్తూ ఉండాలన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోమ్ సెక్రటరీ అజేయ్ భల్లా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించిన లేఖను చదివి వినిపించారు. లేఖలో భాగంగా ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్రాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతాలు మారే క్రమంలో కరోనా వ్యాధి మరింత  ప్రబలే అవకాశముండటంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలన్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత రాష్ట్రాల వ్యక్తులకు భోజనం, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అభూత కల్పనలు, అపోహలు భయాందోళనలు కల్గించే వార్తలు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఒకవేళ ప్రచారం చేస్తే చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అవాస్తవ కథనాలను దయచేసి ఎవరూ షేర్ చేయవద్దని ఈ విషయంలో సామాజిక బాధ్యత వహించాలని కమిషనర్ కోరారు. మాస్క్ లు 5,6 గంటలకు పైగా ఎక్కువ సేపు వినియోగించవద్దని అనంతరం దాన్ని పాతిపెట్టడమో, కాల్చివేయడమో చేయాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప సాధారణ వ్యక్తులు మాస్కులు వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులు మాస్కులు వాడాల్సిన అవసరముంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments