Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:01 IST)
ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు దాడిచేసి ఇల్లు కూల్చి వేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉప్పలూరు గ్రామంలో జరిగింది.
 
ఉప్పలూరు గ్రామానికి చెందిన కలపాల రాజ్‌కుమార్‌, కొండ్రు మౌనిక ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్‌ గన్నవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. మౌనిక భీమవరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. మేజర్లయిన వీరిద్దరూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని  వేలంగిణిమాత ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం సమాచారం తెలుసుకున్న మౌనిక బంధువులు రాజ్‌కుమార్‌ ఇంటిని ధ్వంసం చేశారు. అతని తల్లిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రేమ జంట రక్షణ కల్పించాలని కోరుతూ కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments