లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:01 IST)
ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు దాడిచేసి ఇల్లు కూల్చి వేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉప్పలూరు గ్రామంలో జరిగింది.
 
ఉప్పలూరు గ్రామానికి చెందిన కలపాల రాజ్‌కుమార్‌, కొండ్రు మౌనిక ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్‌ గన్నవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. మౌనిక భీమవరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. మేజర్లయిన వీరిద్దరూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని  వేలంగిణిమాత ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం సమాచారం తెలుసుకున్న మౌనిక బంధువులు రాజ్‌కుమార్‌ ఇంటిని ధ్వంసం చేశారు. అతని తల్లిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రేమ జంట రక్షణ కల్పించాలని కోరుతూ కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments