ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం: మంత్రి ఆదిమూలపు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (08:27 IST)
గిరిజనాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గిరిజనుల కోసం పాటు పడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

ప్రకాశం జిల్లా దోర్నాలలో మంత్రి  మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాల అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో ఉన్నత శిఖరాలకు గిరిజనులు చేరుకోవాలని, విద్య ద్వారానే అటువంటి విజయాలు అందుకోగలమన్నారు.

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనేది జగనన్న ఉద్దేశ్యమని అందుకోసం విద్యకు అధిక నిధులు కేటాయించటం జరిగిందన్నారు. 
 
గిరిజన బాలికలను చదువుకునేలా ప్రోత్సహించాలని, ముఖ్యమంత్రి జగనన్న గిరిజనులకోసం ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.

నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను చూసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ కోసం సిపార్సులు చేసె పరిస్థితులు రాబోతున్నాయన్నారు. 
 
ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం కాబోతుందని ఆయన అన్నారు. అటవీశాఖ నిభంధనలతో కొన్ని గిరిజన గూడేలు అభివృద్ధికి నోచుకోవటం లేదని, విద్యుత్, రోడ్డు సౌకర్యాలకు అటవీశాఖ నిభందనలు అడ్డు నిలిచాయన్నారు.

వన్య ప్రాణుల సంరక్షణ తో పాటు అక్కడ ఉండే మనుషుల గురించి కూడా అధికారులు ఆలోచించాలన్నారు. ఇటువంటి ఎన్నో సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 
 
గిరిజన గూడేల్లో సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ అన్నారు. అనంతరం గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన పలు పథకాలకు సంబందించిన  పరికరాలు లబ్దిదారులకు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments