Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో పోరుకు మేముసైతం అంటున్న పోలీసులు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:24 IST)
గుంటూరు జిల్లా మాచర్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ, ఎస్పీ గార్ల ఆదేశాలమేరకు మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు, పట్టణంలోని రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో మరియు  ప్రయాణం చేసే బస్సులో, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ప్రజలకు కరోనా వైరస్ గురించి మరియు మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతరం మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాలలో బయటకు రావద్దని సూచించారు.

అనంతరం బస్సులో మరియు ఆటోలో టిఫిన్ బండ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాలలో మాస్క్ లేని ప్రజలకు మాస్క్ లు అందించారు. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయటకు రావద్దని సూచించారు. కొంత కాలం వరకు మాస్క్ అనేది మన జీవితంలో నిత్య అవసర వస్తువు అని తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో రూరల్ పోలిస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments