Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసిని పెళ్లాడినందుకు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:59 IST)
తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాడన్న అక్కసుతో ప్రియురాలి తరపు బంధువులు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి ఇంటిని బుగ్గి చేసారు. ఐతే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని జరగలేదు.
 
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా నాగసముద్రం మండలంలోని వెంకటాంపల్లికి చెందిన సుమిత్ర అనే యువతి గ్రామ వాలంటీరుగా విధుల నిర్వహిస్తోంది. ఈమె అదే గ్రామానికి చెందిన హేమంత్ తో ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు యువతి తరుపు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రూరల్ పోలీసు స్టేషనుకి వెళ్లి తాము మేజర్లమనీ, వివాహం చేసుకున్నట్లు తెలిపారు. దానితో ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి సర్ది చెప్పి పంపారు.
 
ఐతే అమ్మాయి తరపు బంధువులు ఆగ్రహంతో వుండటంతో పెళ్లి చేసుకున్న నూతన జంటను దూరంగా పంపారు అబ్బాయి తరపు పెద్దలు. కానీ యువతి తరపు బంధువులు మాత్రం ఆగ్రహం పట్టలేక పెళ్లికొడుకు ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీనితో ఇల్లు అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments