Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

సెల్వి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (14:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో ప్రసవ వేదన భరించలేక ఆ చిట్టితల్లి మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. గర్భం చేసింది ఎవరో కూడా తెలియకపోవడంతో ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 16 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 
 
బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఈ క్రమంలో ఆమెను ఇంట్లోనే ఉంచారు. అయితే శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బాలికకు ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిబిడ్డలను అంబులెన్సులో తిరుపతికి తరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక గర్భానికి కారకులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments