Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను తిట్టారు... అందుకే నేను బూతులు తిట్టా : నిజాన్ని అంగీకరించిన పోసాని

ఠాగూర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:08 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత శ్రీ అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు పోసాని నేరానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట నిజాన్ని అంగీకరించారు. 
 
బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి రైల్వే కోడూరుకు తరలించారు. ఆ తర్వాత గురువారం రాత్రి రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ హాజరుపరిచారు. ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం శుక్రవారం ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు ఇరు వర్గాల వాదోపవాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు ఆలరించిన న్యాయమూర్తి.. నిందితుడు పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. 
 
మరోవైపు, కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలు అంగీకరించారు. తన భార్యను దూషించారని, అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సివచ్చిందన్నారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. 
 
తన భార్యను దూషించిన దూషణలకు కట్ చేసి.. బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments