Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు అకాడమీ తెదేపా అకాడమీ కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:22 IST)
తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, మరింత విస్తృతం చేసేందుకే కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ద్రవిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసం సంస్కృతాన్ని జోడించి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెలుగు అకాడమీ తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించాలని.. తమ విమర్శలు సరిచేసుకోవాలని హితవు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మంత్రి ఆరోపించారు. సంస్కృతం భారతీయ భాషలకు మూలమన్నారు.

దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ ఉంటుందని.. రెండింటినీ వేర్వేరు భాషలుగా చూడలేమని వివరించారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

విభజన తర్వాత రెండేళ్లలో తెలుగు అకాడమీని ఏపీలో ఏర్పాటు చేయలేకపోయారని.. అందుకే ఇప్పుడు రెండింటినీ కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments