Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థి ఇంటి ముందు బైఠాయించిన ఉపాధ్యాయుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (10:27 IST)
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. దీనికి కారణం గత పదిరోజులుగా ఆ విద్యార్థి బడికి రావడం లేదు. దీంతో ఆ విద్యార్థిని మళ్లీ బడికి పంపాలని తల్లిదండ్రులను కోరుతూ ఉపాధ్యాయుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి నేలపై కూర్చొని బైఠాయించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగింది.
 
ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో పదో తరగతిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. వారిలో నవీన్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా బడికి రావడంలేదు. ఆ విద్యార్థిని పాఠశాల రప్పించేందుకు ప్రధానోపాధ్యాయుడి సూచనతో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉదయం విద్యార్థి ఇంటికి వెళ్లారు. 
 
నవీన్ పది రోజులుగా బడికి రావడంలేదని చదువులేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అతని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థిని బడికి పంపించాలని కోరుతూ ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్ది సమయం తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డను బడికి పంపేందుకు పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments