Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థి ఇంటి ముందు బైఠాయించిన ఉపాధ్యాయుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (10:27 IST)
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. దీనికి కారణం గత పదిరోజులుగా ఆ విద్యార్థి బడికి రావడం లేదు. దీంతో ఆ విద్యార్థిని మళ్లీ బడికి పంపాలని తల్లిదండ్రులను కోరుతూ ఉపాధ్యాయుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి నేలపై కూర్చొని బైఠాయించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగింది.
 
ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో పదో తరగతిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. వారిలో నవీన్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా బడికి రావడంలేదు. ఆ విద్యార్థిని పాఠశాల రప్పించేందుకు ప్రధానోపాధ్యాయుడి సూచనతో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉదయం విద్యార్థి ఇంటికి వెళ్లారు. 
 
నవీన్ పది రోజులుగా బడికి రావడంలేదని చదువులేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అతని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థిని బడికి పంపించాలని కోరుతూ ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్ది సమయం తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డను బడికి పంపేందుకు పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments