Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థి ఇంటి ముందు బైఠాయించిన ఉపాధ్యాయుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (10:27 IST)
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. దీనికి కారణం గత పదిరోజులుగా ఆ విద్యార్థి బడికి రావడం లేదు. దీంతో ఆ విద్యార్థిని మళ్లీ బడికి పంపాలని తల్లిదండ్రులను కోరుతూ ఉపాధ్యాయుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి నేలపై కూర్చొని బైఠాయించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగింది.
 
ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో పదో తరగతిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. వారిలో నవీన్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా బడికి రావడంలేదు. ఆ విద్యార్థిని పాఠశాల రప్పించేందుకు ప్రధానోపాధ్యాయుడి సూచనతో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉదయం విద్యార్థి ఇంటికి వెళ్లారు. 
 
నవీన్ పది రోజులుగా బడికి రావడంలేదని చదువులేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అతని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థిని బడికి పంపించాలని కోరుతూ ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్ది సమయం తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డను బడికి పంపేందుకు పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments