Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రితో కలిసి గుడికి వెళుతున్న యువతి కిడ్నాప్

girl kidnap
, మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన తండ్రితో కలిసి గుడికెళ్లి పూజలు చేస్తున్న యువతిని తన స్నేహితులతో కలిసి ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. జిల్లాలోని చందుర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై యువకుడిపై యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ కిడ్నాప్ వ్యవహరమంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
జిల్లాలోని చందుర్తి మండలం, మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని అనే యువతిని  మంగళవారం తెల్లవారుజామున హనుమాన్ ఆలయంలో పూజ చేస్తుండగా కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఈ యువతికి తోడుగా తండ్రి కూడా వెళ్లాడు. అయితే, అప్పటికే ఆలయం వద్దకు చేరుకున్న కిడ్నాపర్లు, ఆ యువతి తండ్రిని పక్కకు నెట్టేసి ఆమెను కారులో ఎక్కించుకుని పారిపోయారు. కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. 
 
తన కుమార్తె కిడ్నాప్ వెను గ్రామానికే చెందిన కటుకూరి జాన్ ప్రమేయం ఉండొచ్చని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గతంలో శాలిని, జాన్‌లు ఇంటి నుంచి ఒకసారి పారిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ సమయంలో శాలిని మైనర్ కావడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని తిరిగి తీసుకొచ్చి అప్పగించారు. ఆ సమయంలో జాన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
శాలినికి ఇటీవల మైనార్టీ తీరడంతో మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న జాన తన స్నేహితులతో వచ్చి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగ విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?